SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తమ సర్వీస్ ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఎంపీడీవో లాజర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ ఈ రోజుతో నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కాలాన్ని పూర్తి చేసుకున్నామని
ఈ కాలాన్ని సర్వీస్ గా పరిగణిస్తూ ప్రభుత్వం వెంటనే జిఓ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్ని విజయవంతంగా నిర్వహించడంలో, అలాగే తాజాగా కేంద్రం ప్రకటించిన జాతీయస్థాయి పంచాయితీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 8 అవార్డులు దక్కాయి అంటే అది కేవలం పంచాయతీ కార్యదర్శుల కృషి మాత్రమే అని అన్నారు.
వచ్చే రెండు వారాల సమయంలో జెపిఎస్ ల క్రమబద్దీకరణ చేయని యెడల ఈ నెల 28 తేదీ నుండి సమ్మె కు వెళ్తామని పంచాయితీ కార్యదర్శులు తెలియపర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ పద్మ అన్ని గ్రామ పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS