SAKSHITHA NEWS

జగనన్న మా భవిష్యత్తు
మాట మీద నిలబడే వ్యక్తి జగనన్న
కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడడం”
నగర మేయర్ డాక్టర్ శిరీష
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ డాక్టర్ శిరీష


*సాక్షిత : *జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమము 27 డివిజన్ పరిధిలోని చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి లో సాయంత్రం కరపత్రాలను పంచుతూ అందరికీ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతు ఇస్తారా అని తెలుసుకొని వారి స్పందనను నమోదు చేశారు. అనంతరం వారి అనుమతితో వారి ఇంటికి “జగనన్నే మా భవిష్యత్” స్టిక్కర్లను అతికించారు. మళ్ళీ సంక్షేమ సారధి జగన్ మెహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయాని లేని పక్షంలో ఆగిపోతాయాని అన్నారు.

మేయర్ మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిగా ఇప్పటికే జగనన్న, ఇచ్చిన హామీలు 98% నెరవేర్చాడు.
కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడమని ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చర్యలు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.
జగనన్న విప్లవాత్మక వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి, లబ్ధిదారులకు లేదా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తూ అవినీతికి తావు లేకుండా చేశారు.
అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటున్నారు.
మరోసారి జగనన్నకు అండగా ఉంటామని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి నాయకులు భరణి యాదవ్, తులసి యాదవ్, రమేష్,వెంకట ముని, గీతా యాదవ్, చిరంజీవి, పురుషోత్తము, కార్యకర్తలు, వార్డు కన్వీనర్లు, గృహ సారుదులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS