SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

యువతను మోసం చేసిన జగన్ : టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు

అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారన్నారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని నాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారు.

కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS