మా నమ్మకం నువ్వే జగన్

Spread the love

మహిళలను మహారాణిలా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ శిరీష


సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ లో సాయంత్రం పెద్ద కాపు వీధి ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, నగర అభివృద్ధిపై మీరు సంతృప్తిగా ఉన్నారా. అంటూ ప్రజలతో మమేకమయ్యారు.
డివిజన్ లో మేయర్ ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ జగనన్న లబ్ధి పొందామని సంతృప్తి వెలబుచ్చడం జరిగింది.
ప్రతి ఇంటికి, మొబైల్ కు జగనన్న స్టిక్కర్ అంటించమని వారి కోరినారు.
మేయర్ మీడియాతో మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం వచ్చినాక మహిళలను మహారాణుల తీర్చిదిద్దిన ఘనత జగనన్నకే దక్కుతుందని అని తెలిపారు. ప్రతి లబ్ధిదారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం తెలియజేశారు.
చెప్పాడంటే.. చేస్తాడంటే.


మాట మీద నిలబడే వ్యక్తిగా ఇప్పటికే జగనన్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చాడని తెలిపారు.
జగనన్న కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడమని”ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. నగర ప్రజలు కూడా 2024 లో కూడా జగనన్ననే ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా మేయర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి నాయకులు భరణి యాదవ్, తులసి యాదవ్, ఈతమాకుల సురేష్, గోపాల్ రెడ్డి, చింత రమేష్, సుధా యాదవ్, వెంకట ముని, గజేంద్ర, నాగేశ్వరరావు, గృహ సారుదులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page