జగద్గిరిగుట్ట బస్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .

Spread the love

జగద్గిరిగుట్ట బస్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: జగద్గిరిగుట్ట బస్టాండ్ ని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. 2014, 2018, GHMC ఎన్నికల్లో జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటుచేస్తామని బీఆర్ఎస్ నేతలు వాగ్దానాలు చేసి, వాటిని విస్మరించారని అన్నారు. ప్రజా సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల వాగ్దానాలు నీళ్ల మీద మాటలేనని, మోసపూరిత వాగ్దానాలు చేసి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు ఈసారి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.

ఎమ్మెల్యే చేస్తున్న ప్రగతి యాత్ర సినిమా షో ను తలపిస్తుందని ఎద్దేవా చేసారు. త్వరితగతిన బస్సు డిపో ఏర్పాటు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానిక ట్రాఫిక్ సిఐకి ఫోన్ చేసి డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు జేకే శేఖర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, ఇంఛార్జ్ మోతె శ్రీనివాస్, నాయకులు మేకల సురేష్ రెడ్డి, అర్కల సుధా, వసుంధర, అరుణ్ కుమార్, అరుణా రెడ్డి, పరశురామ్, పడాల సత్యనారాయణ, సిద్దిరాం రెడ్డి, మల్లారెడ్డి, రాజమణి, హనుమాన్ చారి, సాంబయ్య, మణి గౌడ్, గండి రాజు యాదవ్, గీత, రమేష్ యాదవ్, మాధవులు,భాస్కర్, నాగరాజు, ముప్పిడి రవి, హేమలత, రాజేశ్వర్ రావ్, స్వప్న, రాకేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page