రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా ఆరోపణలు చేయటం కాంగ్రెస్, బిజెపికి అలవాటైంది…

Spread the love

సీఎం కేసీఆర్ కు లభిస్తున్న ఆదరణను చూసి బిజెపికి భయం పట్టుకుంది…
బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు.
సీఎం కేసీఆర్ కి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుంది. సీఎం కేసీఆర్ కి లభిస్తున్న ఆదరణను చూసి బిజెపికి భయం పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా ఆరోపణలు చేయటం కాంగ్రెస్, బిజెపికి అలవాటైంది. ప్రగతివైపు దూసుకువెళ్తున్న తెలంగాణను యావత్ భారతదేశం చూస్తోంది. ఇక్కడ విపక్ష నేతలు విఫలమయినట్టే జాతీయస్థాయి నేతలు వచ్చినా విఫలమవుతున్నారు. గతంలో రైతు డిక్లరేషన్ కు ఆదరణ లేదు. ప్రజల నుండి ఎటువంటి స్పందన రాలేదు. నేడు యూత్ డిక్లరేషన్ కు అదే జరగనుంది.

అధికారంలోకి రామనే విషయం వారికి కూడా తెలుసు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలి. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను కేవలం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. కర్ణాటకలో బిజెపి ఓటమి ఖాయం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇకనైనా విపక్షాలు బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలి. ఆరోపణలు చేసే ముందు దమ్ముంటే ఆధారాలు బయటపెట్లాలి. ప్రజల గుండెల్లో ఉన్నది కేసీఆర్ గారే. కాబట్టే జరిగిన రెండుసార్లు ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని అందించారు. ఎలాంటి సందేహం లేదు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా 100కు పైగా సీట్లు సాధించి అధికారంలో ఉండబోతున్నాం

Related Posts

You cannot copy content of this page