తిరుపతిలో 52 వాలెంటిర్ల పోస్టులకు ఆహ్వానం – కమిషనర్ హరిత ఐఏఎస్

Spread the love

సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ యాభై సచివాలయముల పరిధిలో 52 వాలెంటీర్ల పోస్టులు ఖాళీగా వున్నాయని, అర్హులైన వారు ఈ నెల 20వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలియజేసారు.

అర్హతలు గురించి తెలియజేస్తూ దరఖాస్తుదారులు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నివాసితులై, 10 పాసై వుండాలన్నారు. ప్రభుత్వ నిబందనల మేరకు నియమించుకొను వాలంటీర్ల సంఖ్యలో 50 శాతం మహిళలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ధరఖాస్తులను ఆన్లైన్ లో ఈ వెబ్ సైట్ నందు http://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main-Application->volunteer Recruitment ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన వాలంటీర్ కు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనము ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదిలోపు ధరఖాస్తు చేసుకుంటె, పరిశీలించి, అర్హులైన వారిని 23వ తేది నియమించుకోవడం జరుగుతుందని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page