SAKSHITHA NEWS

అంతర్గత సీసీ రోడ్డు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని ఎపిఅర్ విల్లాస్ కి చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తమ కాలనీలో అంతర్గత సీసీ రోడ్డు మరియు మంచినీటి సరఫరా పైపులైన్ నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సురేష్ మడ్డు, నాగేంద్ర, రాజ, చండు, శ్రీకాంత్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS