SAKSHITHA NEWS

ధర్నాకు దిగిన రాజకీయ పార్టీల నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధి)
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి మండల్ పర్వేద గ్రామములో శంకర్పల్లి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు తన సిబ్బందితో మధ్యాహ్న 3 గంటలకు చేరుకొని హల్చల్ సృష్టించారు. ఒకేసారిగా ఉన్నట్టుండి తమలాటిలకు పని చెప్పి గ్రామస్తులను ఓట్లు వేసేందుకు వెళుతున్న ఓటర్లను చెదరగొడుతూ లాఠీలు గెలిపించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉత్రికత వాతావరణం నెలకొని ప్రజలంతా భయందోళనతో పరుగులు తీశాను. ఈ ఘటనలో పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో పలువురు గాయపడ్డారు. దీన్నంతా అక్కడే ఉండి గమనించిన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన ఎంపిటిసి చేగూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ ఎల్లయ్య,కృష్ణారెడ్డి,గోవర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలంతా ధర్నాకు దిగారు. పోలీస్ జులుం నశించాలని, అతిగా ప్రవర్తించిన పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిటిసి వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ లు మాట్లాడుతూ…ఏ కారణం లేకుండా దురుసుగా ప్రవర్తించిన లాఠీ ఛార్జ్ చేయించిన ఇన్స్పెక్టర్ నాగరాజును రెస్పాండ్ చేయాలని, లాఠీ ఛార్జీకీ పాల్పడిన పోలీసు అధికారి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంతవంతమైన వాతావరణం లో పోలింగ్ జరుగుతుండగా పోలీసులు అతిగా వ్యవహరించి లాఠీలు జుళిపించారన్నారు.ఈలాఠీ చార్జిని ఏ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుడు తీవ్రంగా ఖండించారు. చివరికి గ్రామస్తులు చేపట్టిన ధర్నాకు దిగివచ్చిన పోలీసులు గ్రామస్తులకు క్షమాపణ చెప్పడం వారంతా శాంతించారు.


SAKSHITHA NEWS