SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా త్రిపురాతంతకం

ఎరువుల దుకాణాల తనిఖీ
ఈరోజు త్రిపురాంతకం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సిహెచ్ రమాదేవి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలలో స్టాక్ రిజిస్టర్లు బిల్లు పుస్తకాలు మరియు ఎరువుల భౌతిక నిల్వలను తనిఖీ చేయడం జరిగింది. స్టాక్ రిజిస్టర్లు సరిగా నిర్వహించని కారణంగా.. రెండు లక్షల విలువైనటువంటి ఎరువులను అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. వెంకట రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, మన గ్రోమోర్ సెంటర్, మరియు కిసాన్ అగ్రి మాల్ దుకాణములందు తనిఖీలు నిర్వహించారు. ఎరువుల భౌతిక నిల్వలు మరియు సరియైన పత్రాలు లేనియెడల కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కే నీరజ మరియు మార్కాపురం సాంకేతిక వ్యవసాయ అధికారి శ్రీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS