తెలంగాణ భరోసా సభ గోడ పత్రిక ఆవిష్కరణ –

Spread the love

మే 7 న జరగబోయే తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి

— బహుజనులంత మాయావతి కి ఘన స్వాగతం పలకాలి – ఆర్ ఎస్ ప్రవీణ్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 7వ తేదీన జరగబోయే తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్లను నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ మే 7వ తేదీన జరగబోయే తెలంగాణ భరోసా సభకి ముఖ్యఅతిథిగా బహుజనుల ఆశాజ్యోతి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ముఖ్యఅతిథిగా వస్తున్న సందర్భంగా బహుజనులందరూ ఏకమై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు.

అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కావున బహుజనులంతా ఈ సభను కుటుంబంలో జరుగుతున్న పండుగల భావించి తండోపతండాలుగా తరలివచ్చి మాయావతి కి ఘన స్వాగతం పలకాలని బహుజనులకు మనవి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర కార్యదర్శి నర్ర నిర్మల, జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు,జిల్లా ఈసి మెంబెర్ గ్యార మారయ్య, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కూమర్,రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్,కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల ఉపాధక్షులు గ్యార శేఖర్,ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కోశాధికారి మునుగోటి సత్తయ్య, రామన్నపేట ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, కార్యదర్శి నకిరేకంటి సతీష్, కోశాధికారి గట్టు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page