దేశంలో ఎస్సీలకు కాంగ్రెస్తోనే పెద్దపీట

Spread the love

మాదిగ జాతిని బిజెపికి తాకట్టు పెట్టిన మందకృష్ణ మాదిగ

కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండగడుపుల సూరయ్య

దేశంలో ఎస్సీలకు నెహ్రూ మొదలుకొని నేడు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండ గడుపుల సూరయ్య అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేయలేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ది త్యాగాల కుటుంబమని ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. నాడు నెహ్రూ హయాంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు న్యాయశాఖ మంత్రిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉష మెహ్రా కమిషన్ను ప్రధాని మోడీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ జాతిని మోడీకి తాకట్టు పెట్టాడని వంద రోజుల్లో చేస్తామన్న వర్గీకరణ అధికారంలో ఉండి పదేళ్లు అవుతున్నా ప్రశ్నించడం లేదన్నారు. మందకృష్ణ మోడీకి మద్దతు పలకడం కాంగ్రెస్ది రెడ్ల రాజ్యం అనడం ఎంతవరకు సమంజసం అన్నారు. బిసి ముఖ్యమంత్రిగా బీసీలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పాలన్నారు. మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని అందులో సందేహం లేదన్నారు. మందకృష్ణ మాదిగ ఇకనైనా మాదిగల కోసం ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేసే పార్టీలతో కలిసి రావాలని అన్నారు.

Related Posts

You cannot copy content of this page