కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

Spread the love

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

• డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యం

• 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన మేలు…ఇదిగో…

• ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్

• ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు…?

• తెలంగాణకు కేసీఆర్ మెయిన్ విలన్… కాంగ్రెస్, ఎంఐఎం సహ విలన్లు, కమ్యూనిస్టులు ఆకు రౌడీలు

• 2018 నుండి పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు దుష్ట చతుష్ట పార్టీల కుట్ర

• గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను ఎలక్షన్ ఫండ్ ఇస్తున్న కేసీఆర్

• 4గురి చెరలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పిద్దాం

• బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇల్లు, రైతులకు పంటల బీమా అమలు చేస్తాం

• ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం

• ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన …. ఖాళీ అయ్యే 3 శాతం పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం

• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

• హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని… దీనిని ద్రుష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే అంశాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు. అట్లాగే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతోపాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేందుకు ఈనెల 30 నుండి వచ్చే నెల 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన ప్రయోజనాలను వివరించారు.

• హైదరాబాద్ లోని చంపాపేటలో ఈ రోజు బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, డాక్టర్ లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మరళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి చేసిన ప్రారంభోపన్యాసంలోని ముఖ్యాంశాలు…

• తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం తథ్యం.

• కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నాం. ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాం

• దేశంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివ్రుద్ధి జరగడం లేదు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం.

• మోదీ ప్రధాని 9 ఏళ్ల పాలనలో భారత్ విశ్వగురు స్థానానికి ఎదుగుతోంది. పేద కుటుంబం నుండి వచ్చిన మోదీకి పేదల కష్టాలను గుర్తించారు. వారి జీవితాల్లో మార్పుతో దేశ ప్రగతి సాధ్యమనే ఉద్దేశంతో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గుజరాత్ లో రాత్రిపూట బయటకు వస్తే మహిళలు చెంబు పట్టుకుని బహిర్భుమికి వెళుతున్న ద్రుశ్యాన్ని చూసిన నరేంద్రమోదీ.. స్వచ్ఛ భారత్ పేరుతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు.

• ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన చర్యలను పరిశీలిస్తే… బహిర్భూమికి అవకాశం లేకుండా టాయిలెట్లు నిర్మించారు. పేదలు తలదాచుకునేందుకు ఇండ్లు నిర్మించారు. పేదలకు తిండికి ఇబ్బంది పడకూడదని ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఉపాధికి ఇబ్బంది పడకూడదని జాతీయ ఉపాధి హామీ పథకంతో 100 రోజుల పని కల్పిస్తున్నారు. ఇంటి నుండి బయట అడుగు పెడితే గ్రామాల్లోని రోడ్లన్నీ కేంద్రం నిర్మించినవే. రైతు వేదికలు, హరితహారం, స్మశాన వాటికలు సహా పంచాయతీల్లో జరుగుతున్న అభివ్రుద్ది అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే జరుగుతోంది.

• కోవిడ్ తో ప్రపంచమంతా అల్లాడుతుంటే లాక్ డౌన్ విధించడమే కాకుండా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ప్రజల ప్రాణాలను కాపాడిన వ్యక్తి మోదీ. అట్లాగే ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతే దేశ ఆర్దిక వ్యవస్థను కాపాడుతూ 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదే. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ శక్తిగా తీర్చిదిద్దేందుకు రాత్రింబవళ్లు క్రుషి చేస్తున్న నేత మోదీ. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాఖ్, రామ మందిర నిర్మాణం వంటి సాహోసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.

• గ్రామీణ సదుపాయాల కోసం గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. కొత్త రైల్వే, డబ్లింగ్ పనులుసహా వివిధ ప్రాజెక్టుల కోసం రైల్వే శాఖ ద్వారా తెలంగాణకు 35 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి 1 లక్షా 10 వేల కోట్లను ఖర్చు చేశారు. ఇయాళ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలుసహా ప్రతి ఒక్కరూ రయ్ రయ్ మంటూ వెళుతున్నారంటే అది మోదీగారి చలవే..

• రాష్ట్రానికి 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేశారు. మరో 5 లక్షల ఇండ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా… మంజూరైనవే కట్టలేక పేదలకు అందాల్సిన ఇండ్లను దక్కకుండా చేసిండు కేసీఆర్…దేశం మొత్తం 9 కోట్ల 50 లక్షల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తే.. అందులో తెలంగాణ అడిగినన్ని కనెక్షన్లు ఇచ్చినారు. మొత్తం 11 లక్షల 50 వేల గ్యాస్ కనెక్షన్లు ఈ రాష్ట్రానికే ఇచ్చారు. కోటి కుటుంబాలున్న తెలంగాణలో దాదాపు 30 లక్షల టాయిలెట్లు నిర్మించారు. అంటే ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరికి మోదీ ప్రభుత్వం టాయిలెట్ నిర్మించింది. ఇది నా లెక్క కాదు.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలే… కోవిడ్ సమయంలో తిండిలేకుండా ఎవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో 9 వేల కోట్ల రూపాయల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన ఘనత మోదీగారిదే…

• రైతులకు మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల కోసం లక్ష కోట్లకుపైగా నిధులు వెచ్చించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతు అకౌంట్లో 6 వేల రూపాయలు వేస్తున్నారు. దేశమంతా లక్ష కోట్ల రూపాయల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు.. మన తెలంగాణలో ఈ పథకం కింద 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 8 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత 9 ఏళ్లలో 5 లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణలో 25 వేల కోట్లు ఖర్చు చేశారు. పీఎం స్వనిధి కింద రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మందికి ముద్ర రుణాల కింద 7 వందల కోట్లు ఆర్దిక సాయం చేశారు.

• అట్లాగే రాష్ట్రంలో 7 కోట్ల 72 లక్షల కరోనా డోసులను అందించి తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడిన దేవుడు మోదీగారు.. 6 వేల 2 వందల కోట్లు కేటాయించి రామగుండం ఎరువుల పునరుద్దరించి తెలంగాణసహా దక్షిణ భారతదేశంలో ఎరువుల కొరత లేకుండా చేసిన ఘనత మోదీగారిదే….

డబుల్ ఇంజిన్ సర్కారుంటే ఇంకా మేలు జరిగేది

• అదే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే… ఇంకా ఎక్కువ లాభం జరిగేది… కేంద్ర ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ బీమా పథకాన్ని ఇక్కడ అమలు చేయడం లేదు. అది అమలైతే ప్రతి పేదవాడు రోగమొస్తే 5 లక్షల వరకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకునే వీలుండేది. అట్లాగే గత నాలుగేళ్లుగా ఫసల్ బీమా అమలు చేయడంతో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సాయం అందడం లేదు. ఒకవేళ ఈ పథకం అమలైతే దాదాపు 30 వేల కోట్లకుపైగా రైతులకు సాయం అందేది. దేశంలోని ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో మోదీగారి ప్రభుత్వం 3 కోట్ల ఇండ్లను కట్టిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుంటే ఇయాళ తెలంగాణలో నిలువ నీడలేని ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరయ్యేది. స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, మహిళలకు ముద్రా రుణాల కింద పెద్ద ఎత్తున ఆర్దిక సాయం అందేది. ఉదాహరణకు యూపీలో యోగి సర్కార్ కేంద్ర సాయంతో 30 లక్షలకు పైగా ఇండ్లు కట్టించారు. ముద్ర రుణాల ద్వారా 75 లక్షల మందికి రుణాలిచ్చారు. యూపీలోని యోగి ప్రభుత్వం జల్ శక్తి మిషన్ కింద 16 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇంటింటికి మంచి నీళ్లు అందిస్తే… అందులో నాలుగో వంతు జనాభా ఉన్న తెలంగాణలో మాత్రం మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తక్కువ ఖర్చుతో కమీషన్లకు తావు లేకాం అందరికీ నీళ్లు ఇచ్చేవాళ్లం.

విశ్వాస ఘాతకుడు కేసీఆర్

• కేసీఆర్ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నడు. ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇయాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నడు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నడు. కేసీఆర్ లాంటి నీచుడిని, విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు.. కేసీఆర్ ఎంతటి విశ్వాసఘాతకుడంటే మొన్నటి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ ను మోసం చేసిండు.. తెలంగాణ కోసం మొదటి నుండి నిలబడి కలబడి పార్లమెంట్ బిల్లు పాస్ చేయించిన సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించిన నీచుడు… 2004లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని ఆ పార్టీని, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బయటకొచ్చి ఆ పార్టీని మోసం చేసిండు… 2004లో కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలని, సూది దబ్బడం పార్టీలని తిట్టిన నోరే… ఇయాళ తన అవసరం కోసం కమ్యూనిస్టు పార్టీలను చంకనేసుకుని తిరుగుతున్నడు.. దేశాన్ని కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం మోసం చేస్తే అవసరం తీరాక ఆ కాంగ్రెస్ ను, ఆ కుటుంబాన్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్… అంతెందుకు కర్నాటక ఎన్నికల దాకా జేడీఎస్ కు నిధులు పంపి జట్టు కట్టిన కేసీఆర్… ఆ వెంటనే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ తో జత కట్టిన నీచుడు.. తెలంగాణ కోసం బొంత పురుగునైనా కౌగిలించుకుంటానన్న కేసీఆర్ అసలు నైజం అది కాదు… తన స్వార్ధం కోసం, తన కుటుంబం ప్రయోజాల కోసం బొంత పురుగునైనా నమిలి మింగేసే రకం కేసీఆర్….
• విశ్వాస ఘాతకుడి పాలనలో తెలంగాణలో సబ్బండ వర్గాలు అల్లాడి పోతున్నయ్… పంట నష్టపోయి రైతులు అల్లాడుతున్నరు. పట్టించుకునే నాధుడే లేడు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నరు భరోసా ఇవ్వడం లేదు.. పరీక్షలు సరిగా నిర్వహించడం చేతగాకపోవడంతో విద్యార్థులు చనిపోతున్నారు. అయినా పట్టించుకోవడం లేదు.. చివరకు ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు.. డబ్బుల కోసం మద్యాన్ని ఏరులై పారించి మహిళల పుస్తెలు తెంచుతున్నడు, యువతను బానిసలుగా చేస్తున్నడు అయినా స్సందించం లేదు..

2018 నుండి పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు దుష్ట చతుష్ట పార్టీల కుట్ర
ఇవన్నీ ప్రశ్నిస్తున్నది బీజేపీ… ప్రజల పక్షాన పోరాడుతున్నది బీజేపీ… లాఠీలకు భయపడకుండా కేసులకు బెదరకుండా ఉద్యమిస్తున్నది బీజేపీ. జైళ్లకు పోతున్నది బీజేపీ. ప్రజలంతా ఇయాళ కేసీఆర్ ను ఢీ కొట్టేది బీజేపీయేనని భావనతో ఉన్నరు. బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని నమ్ముతున్నరు. 2018 నుండి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. అందుకే గత మూడేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆదరిస్తూ వస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు పెడితే… జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీవైపు నిలిచారు. ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లే రాని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయమవుతోందో ఆలోచించాలి. ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న 5 గురు ఎమ్మెల్యేల్లో నలుగురు నాలుగు దిక్కులు చూస్తూ నాలుగు స్థంభాలాట ఆడుతుంటే… ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నడు.
• ఇవన్నీ చూసిన తరువాత ఎట్లయినా బీజేపీని దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, ఒక సెక్షన్ మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నడు. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాంగనే తెలంగాణలో బీజేపీ పనైపోయిందని ప్రచారం చేస్తున్నయ్. మీడియాలోని ఓ సెక్షన్ వీరికి వంతపాడుతూ బీజేపీలో చేరిన లీడర్లంతా కాంగ్రెస్ లోకి పోతున్నరని కథనాలు మొదలు పెట్టినయ్.. కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేంది? అక్కడ ఓడిపోతే ఇక్కడెందుకు బీజేపీ బలహీనపడుతుందో మీడియా యాజమాన్యాలు, విజ్ఝులైన రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఆలోచించాలి. శాసనసభ ఉప ఎన్నకలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నా. ఢిల్లీ నుండి గల్లీలో లేని కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచాలని చూస్తే ప్రజా విశ్వాసం కోల్పోక తప్పదు.

• గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను ఎలక్షన్ ఫండ్ ఇస్తున్న కేసీఆర్

• కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నడు. ఆ పార్టీకి సొంతంగా అధికారం రాదని తేలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పాకెట్ మనీ పేరుతో ఎన్నికల ఫండింగ్ చేస్తున్నడు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే వాళ్లంతా బీఆర్ఎస్ తో కలిసి అధికారం పంచుకోవాలని చూస్తున్నరు.

• బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. మెజారిటీ సాధిస్తుంది. అనుమానం లేదు. సినిమాల్లో గుర్తుండిపోయిన విలన్లు రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య.. రాష్ట్రంలో కేసీఆర్ మెయిన్ విలన్ రావుగోపాలరావు అయితే కాంగ్రెస్, ఎంఐంఎం పార్టీలు సత్యనారాయణ, అల్లు రామలింగయ్య , కైకాల సత్యనారాయణ వంటి విలన్లు. కమ్యూనిస్టులు ఆకు రౌడీల టైపు….. వీళ్లంతా కలిసి హీరోలాంటి బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నరు. హీరోలెక్క ఫైట్ చేస్తూ ప్రజలను కాపాడుకునేందుకు పోరాడుతోంది బీజేపీ. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరనే విషయాన్ని ప్రజలకు కూడా అర్ధమైంది…

బీజేపీవైపు ప్రజల చూపు

• అయితే నాకు బాధన్పించే విషయం ఒక్కటే… రైతులు, నిరుద్యోగులు, విద్యార్తులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలుసహా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు బాధల్లో ఉన్నరు. కేసీఆర్ పాలన విరగడ కావాలని కోరుకుంటున్నరు. వాళ్లంతా ఆశగా బీజేపీవైపు ఎదురు చూస్తున్నరు. బీజేపీ సింహంలా సింగిల్ గానే కొట్లాడుతుంది. అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఆధ్వర్యలో పేదల రాజ్యాన్ని స్థాపించడం ఖాయం.

బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇల్లు, ఉద్యోగాల భర్తీ, రైతులకు బీమా

• బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేద, మధ్య తరగతి విద్యార్ధి ఉచితంగా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడేలా చదివిస్తాం. బకాయిల్లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ ను సక్రమంగా చెల్లిస్తూ అటు చిన్న చిన్న ప్రైవేటు కాలేజీలను ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి ప్రేవేట్ కు దీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్ది కార్పొరేట్ దోపిడీని అడ్డుకుంటాం. తెలంగాణలోని ప్రతి పేద, మధ్య తరగతి వాడికి హెల్త్ కార్డు అందిస్తాం… ఏ జబ్బు చేసినా ఉచితంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తాం… అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం..ఏటా ప్రభుత్వ శాఖల్లో 3 శాతం ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. వాటిని ముందుగానే గుర్తించి భర్తీ చేస్తాం. పంట నష్టపోయిన రైతుకు బీమా పథకాన్ని అమలు చేసి నష్టపరిహారం అందిస్తాం. సన్న, చిన్న కారు రైతులతోపాటు కౌలు రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు అందిస్తాం. రైతును రాజుని చేసి సగర్వంగా గల్లె ఎత్తుకునేలా చేస్తాం.

4గురి చెరలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పిద్దాం

• ఈ 10 ఏళ్ల తెలంగాణలో సాధించిన విజయాలపై బీఆర్ఎస్ పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పండుగ చేసుకుంటుంది. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు? కేసీఆర్ పాలనలో సాధించిందేమిటి? అవినీతి, ఆక్రందనలు, అర్తనాదాలు, హత్యలు, అత్యాచారాలు తప్ప. తెలంగాణ అంటే 4 కోట్ల మంది ప్రజలనే సోయిని మర్చిపోయిండు కేసీఆర్.. ఆయన కుటుంబంలోని 4 గురి కోసమే తెలంగాణ వచ్చినట్లుగా పాలిస్తున్నడు. తెలంగాణ లో కోటి కుటుంబాలున్నాయనే సోయి మర్చిపోయిండు. ఒకే కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందనుకుంటున్నడు. చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు. ఆయన సాధించిన పురోగతి ఏమైనా ఉందంటే… లీకులు- లిక్కర్-అప్పుల్లోనే పురోగతి సాధించిండు. ఆ లీకు వీరుడిని, లిక్కర్ రాణి చేసే అక్రమాలను కాపాడేందుకు సీఎం సీటు మీద కూర్చున్నడు. అవినీతిపరులను, హంతకులను కాపాడటానికి ప్రగతి భవన్ ను వేదికగా మార్చిండు. ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ లోక్ సభలో బీఆర్ఎస్ తో కలిసే నడుస్తోంది. అసెంబ్లీలో కలిసే పనిచేస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. కలిసే దోచుకుంటున్నరు. కలిసే భూములను పంచుకుంటున్నరు. వీళ్లా ప్రజలకు ప్రత్యామ్నాయం? ఆలోచించండి. ఇంకా సిగ్గులేకుండా బీఆర్ఎస్ పాలన జూన్ 2 నుండి 21 రోజుల పాటు ఉత్సవాలు చేసుకోవాలనుకోవడం సిగ్గు చేటు. బీఆర్ఎస్ –కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతాం. ఆ దుష్ట చతుష్టయ పార్టీలను బజారుకీడుద్దాం..

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే…

• చివరగా మీకు నేను చెప్పేదొక్కటే… కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడదాం. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే నినాదాన్ని పల్లెపల్లెకు తీసుకెళదాం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే విషయాన్ని గడప గడపకూ తీసుకెళదాం.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page