SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ గ్రామంలో కె.ఎం పాండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి మల్లా రెడ్డి , ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో గల సీనియర్ సిటిజెన్ హాల్ వద్ద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ కె.ఎం పాండు 78వ జయంతి వేడుకలకు మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేఎం పాండు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.ఎం. పాండు చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, డివిజిన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంద సంఘాల నాయకులు సభ్యులు, మహిళ నాయకురాళ్ళు, సీనియర్ సిటిజెన్ హాల్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS