కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

Spread the love

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్

సీతారాముల చల్లని దీవెనలతో కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ పాడిపంటలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ ఆకాంక్షించారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి పాలనకు ఉదాహరణగా రామరాజ్యం అని చెబుతామని, శ్రీరాముడు గొప్ప పరిపాలకుడని, తన రాజ్యంలో ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారన్నారు. శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ శ్రీరాముడి పాలనే అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి పాలించిన వారే నిజమైన పాలకులని లోకానికి తెలియజెప్పారన్నారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page