ఘనంగా సాహు మహారాజ్ జయంతి

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ మహనీయుల చౌరస్తాలో సాహుమహారాజ్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహుమరాజ్ చిత్రపటానికి చిట్యాల బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు గ్యార శేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ మహరాష్ట్రలోని కొల్హాపూర్ సంస్థానంలొ మొట్టమొదట ఘణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థకు, ప్రాతినిధ్య భాగస్వామ్యానికి చట్టం చేసి పునాదులు వేసిన మహామహుడు ఛత్రపతి సాహుమహారాజ్ జనాభా తమాషా ప్రకారం విద్యా ఉద్యోగం అధికార భాగస్వామి ఉండాలని రిజర్వేషన్లు కల్పించారు. మహనీయుల ఆశయాలు సాధించాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సలహాదారు జిట్టా నర్సింహరాజు,పట్టణ నాయకురాలు పాల భవాని, ఉండ్రాతి ఎల్లయ్య,గాధే ఎల్లేష్ ,సుక్క నర్సింహ ,బోయ అభినవ్ ,జిట్ట లింగస్వామి నకిరేకంటి శేఖర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page