స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో స్నేహితుల దినోత్సవం సంబురంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారులు తమ మిత్రుల ముంజేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి తమ ఆత్మీయతను పంచుకున్నారు. తమ మిత్రులకు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. మిత్రులంతా తమ చేతికి కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్లతో నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ చిన్నతనంలో ఏర్పడిన స్నేహభావం కలకాలం నిలిచి ఉంటుందని తెలిపారు. స్నేహ మాధుర్యం విశిష్టతను తెలియజేసేందుకే తమ పాఠశాలలో స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థుల మధ్య సహకారం, సమిష్టి భావం పెంపొందడానికి స్నేహభావం దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్నేహబంధాన్ని చిరకాలం కొనసాగించాలని కృష్ణ చైతన్య కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page