కాంగ్రెస్ సేవాదళ్ నియామకపత్రాలు అందజేసిన హన్మంత్ రెడ్డి ||

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రతిపాదించి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు షఫియుద్దీన్ ఆమోదించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షలు మిద్దెల జితేందర్ * నియమించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మహమ్మద్ షఫియుద్దీన్ మరియు కొలన్ హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా జెస్సి పాల్, ఏ బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులుగా ఫలార్ రెహమాన్, బి బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులుగా విజయ్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సేవాదళ్ అధ్యక్షులుగా పి.కిరణ్ కుమార్, దుండిగల్ మున్సిపాలిటీ సేవాదళ్ అధ్యక్షులుగా వెంకట్ రెడ్డి బాగిలి, కొంపల్లి మున్సిపాలిటీ సేవాదళ్ అధ్యక్షులుగా సాయి యాదవ్, గాజులరామారం సేవాదళ్ అధ్యక్షులుగా శ్రీకాంత్, జగద్గిరిగుట్ట సేవాదళ్ అధ్యక్షులుగా రషీద్,

చింతల్ సేవాదళ్ అధ్యక్షులుగా సందీప్, సూరారం సేవాదళ్ అధ్యక్షులుగా గురుమూర్తి, సుభాష్ నగర్ సేవాదళ్ అధ్యక్షులుగా గుణశేఖర్, కుత్బుల్లాపూర్ సేవాదళ్ అధ్యక్షులుగా ప్రదీప్ కుమార్, జీడిమెట్ల సేవాదళ్ అధ్యక్షులుగా మహేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు తమ శక్తివంచన లేకుండా పని చేసి ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page