SAKSHITHA NEWS

కోడూరు:బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హంసలదీవి బీచ్ గేట్లను మూసివేసినట్లు పాలకాయతిప్ప మెరైన్ ఎస్ ఐ జిలాని తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లన మూసివేయడం జరిగిందని, సముద్ర అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉండటంతో పర్యటకుల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు బీచ్ గేట్లు మూసే ఉంటాయని ఆయన తెలిపారు.


SAKSHITHA NEWS