గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

Spread the love

బాపట్ల జిల్లా కొరిశపాడు హి మండలంలో మార్చ్ 10న ఆదివారం నాడు జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ గారు తెలిపారు.

వాహనాల దారి మళ్లింపు వివరాలు

1) విజయవాడ, గుంటూరు నుండి హై వే పై ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

2) గుంటూరు టౌన్ నుండి ఒంగోలు వెళ్ళు వాహనాలు ఎటుకూరు జంక్షన్ నుండి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట, ఒంగోలు వైపు వెళ్ళవలెను.

3) గుంటూరు నుండి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్ళవలసిన వాహనములు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా ఒంగోలు వెళ్ళవలెను.

గమనిక:
1) 16 వ నంబర్ జాతీయ రహదారి పై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుండి బొల్లాపల్లి మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబడవు కేవలం సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చు వాహనాలను మాత్రమే* అనుమతిస్తారు.

2) ఈ ఆంక్షలు మార్చి 10న ఆదివారం ఉదయం 6 గంటల నుండి అమలులోకి వచ్చును.

Related Posts

You cannot copy content of this page