సూర్యాపేటలో ఘనంగా రన్ ఫర్ జీసస్

Spread the love

గుడ్ ఫ్రైడే రోజు ఏసుక్రీస్తు పరలోక ప్రాప్తి చెంది ఆ మరుసటి రోజు ప్రభువు పునురుస్థానం చెందారని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ తెలిపారు. సూర్యాపేట సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యాక్రమం ఘనంగా నిర్వహించారు. శనివారం చర్చ్ కాంపౌండ్ వద్ద ప్రారంభమై కొత్త బస్ స్టాండ్ వద్ద ర్యాలీ ముగిసింది. అనంతరం నిర్వహించిన కార్యాక్రమంలో పాస్టర్లు మాట్లాడుతూ మానవాళి పాప విమోచననికి యేసు క్రీస్తు తన ప్రాణాలను శిలువలో అర్పించిన రోజున గుడ్ ఫ్రైడేగా, తిరిగి మూడో రోజు ఆదివారం సమాదిలో నుండి లేచిన రోజున ఈస్టర్ గా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా చైర్మన్ మామిడి శ్యామ్సన్,జిల్లా ఎలక్షన్ చైర్మన్ జాకబ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు,పట్టణ సలహాదారుడు జోహార్ పాల్, పట్టణ అధ్యక్షుడు జలగం డేవిడ్ రాజ్,మత్తయి, సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page