సైబరాబాద్ లో ఘనంగా “హరితోత్సవం”.

Spread the love

ప్రారంభించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్,
కమీషనరేట్ పరిధిలో 59 వేలకు పైగా మొక్కలు నాటిన సిబ్బంది

సాక్షిత :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సైబరాబాద్ సీపీ ఆఫీసు, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పీఎస్ లలో ఘనంగా “హరితోత్సవం” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సపోటా మొక్కను నాటి కమీషనరేట్ పరిధిలో హరితోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలాగే సీపీ తో పాటు ఆడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాష్ మహంతి, ఐపీఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., డీసీపీ అడ్మిన్ యోగేశ్ గౌతమ్, ఐపీఎస్., విమెన్& చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్.,మరియు EOW డీసీపీ శ్రీమతి కవిత మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలన్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని పెద్దలు అన్నారని దాని యొక్క ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవాలన్నారు. గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మరియు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. భావితరాల వారికి స్వచ్చమైన పర్యావరణాన్ని అందించేందుకుగాను ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం వుందన్నారు. ప్రతిఒక్కరూ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజూన మొక్కలను నాటడం మరియు మొక్కలను బహుమతిగా అందజేయడం ఒక ఆనవాయితీగా మార్చుకోవాలని తెలిపారు. రాబోవు తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు నాటడం పెద్దఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. సీపీ ఆఫీసులో లో మొత్తం 2000 మంది వరకు పాల్గొన్నారు. వీటిలో సపోటా, బత్తాయి, నేరేడు, టేకు, కాగితపు పూలు/Bougainvillea Flowers నాటామన్నారు. వృక్ష సంపద పెంచేందుకు ప్రతీఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రజలకు సీపీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఆడిషనల్ సీపీ (అడ్మిన్) శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, ఐపీఎస్., డిసిపి అడ్మిన్ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., డిసిపి షీ టీమ్స్ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., మాదాపూర్ ఏడిసిపి నంద్యాల నరసింహారెడ్డి, సిఎస్డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీలు, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, సిటిసి ఏడీసీపీ రామ చంద్రుడు, ఏసీపీలు, ఆర్ ఐ లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ జోన్..

మాదాపూర్ జోన్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, ఏడీసీపీ ఆధ్వర్యంలో ని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. మాదాపూర్ జోన్ పరిధిలో మొత్తం 10000 మొక్కాలు నాటడం జరిగిందన్నారు.

బాలానగర్ జోన్..
బాలానగర్ జోన్ డిసిపి టి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ని అన్ని సబ్ డివిజన్ల ఏసిపి ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. ఈ సందర్భంగా బాలానగర్ జోన్ డిసిపి టి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా 12000 మొక్కలను నాటడం జరిగిందన్నారు.
శంషాబాద్ జోన్..

శంషాబాద్ లా & ఆర్డర్ డిసిపి నారాయణ్ రెడ్డి ఆధ్వర్యంలో ని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా 13000 మొక్కలను నాటడం జరిగింది. ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు ఉత్సాహంగా మొక్కలు నాటారు.

రాజేంద్రనగర్ జోన్…

రాజేంద్రనగర్ జోన్ లా & ఆర్డర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా 12000 మొక్కలను నాటడం జరిగింది. ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు ఉత్సాహంగా మొక్కలు నాటారు.

మేడ్చల్ జోన్..
మేడ్చల్ జోన్ లా & ఆర్డర్ డిసిపి సందీప్ ఆధ్వర్యంలో ని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జోన్ 10000 కు పైగా మొక్కలను నాటడం జరిగింది. ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు ఉత్సాహంగా మొక్కలు నాటారు.
కమీషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Related Posts

You cannot copy content of this page