ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

Spread the love

ప్రకాశం జిల్లా

ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ నాని జాన్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.రాజుపాలెం లో బాప్టిస్ట్ చర్చ్ నుండి త్రిపురాంతకం బస్టాండ్ సెంటర్ వరకు బారి ర్యాలీ నిర్వహించారు.ఈర్యాలిలో చిన్నారులు, సంఘస్తులు ఈత మట్టలను పూలతో అలంకరించి ర్యాలీలో ప్రదర్శించారు.ఈ ర్యాలిలో దావీదు కుమారుడా జయము జయము,యేసు రాజుకు జయము ,హోసన్నా హోసన్నా అంటూ నినాదాలు చేశారు.యేసును శిలువ వేయడానికి ముందుగా గాడిదపై యెరూషలెం వీధులలో వురిగించరని అలాగే దానికి సాదృష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో త్రిపురాంతకం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ చిన్నారులు,పెద్దలు,మహిళలు,యవ్వనస్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page