SAKSHITHA NEWS

హైదారాబాద్‌: ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ పేరుతో ఉన్న ఓ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోతో పాటు.. కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫొటోలు ట్వీట్‌కు జత చేశారు. ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ చేసిన ట్వీట్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రీట్వీట్‌ చేస్తూ ఆస్పత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందన్నారు. ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు


SAKSHITHA NEWS