సబ్ జూనియర్ అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ శ్రీవేద ది యూనివర్స్ స్కూల్ చిన్నారులు ఏప్రిల్ లో గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏడుగురు చిన్నారులు రన్నింగ్ లో 15 గోల్డ్, 1 సిల్వర్ పథకాలను సాధించారు. థాయిలాండ్ లో త్వరలో జరుగనున్న థాయిలాండ్ ఇంటర్నేషనల్స్ కు ఎంపికయ్యారు. విజేతలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా విజేతలను అభినందించింది మెడల్స్ అందజేశారు. క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కోచ్, అధ్యాపకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page