SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను సూరారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, శివాలయ నగర్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి తో కలిసి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ నగర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మహేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మి, అరుణ్, లక్ష్మణ్, మైపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్, వేణు, శంకర్, డేవిడ్, లింగం, చౌడయ్య, షెహనాజ్ బేగం, అర్షియా బేగం, తెరాస కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS