SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గురుమూర్తి నగర్, గుడెన్ మెట్, గిరినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ బి. విజయ్ శేఖర్ గౌడ్, డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య లు కలిసి విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏర్వ సాయికిరణ్, లక్ష్మీ నాద్, కార్తీక్, అంజి, అర్షద్, క్రాంతి, ఓంకార్, రాణి, ఈశ్వరి, రాజు, జెకె, తెరాస కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS