గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ

Spread the love

దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దత్తత్రయ కాలనీలో సీసీ రోడ్లు మంజూరై ఉన్నాయని, అతిత్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. అలాగే కనకదుర్గమ్మ గుడి వీధిలో మంచి నీటి పైప్ లైన్ కు జుంక్షన్ కలపాలి అని దీనివలన ఇరవై కుటుంబాలకు ఇప్పటివరకు చుట్టూ తెరిగివస్తున్న త్రాగునీరు డైరెక్టుగా వచ్చి ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి జుంక్షన్ కలిపే విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. వర్షంలో కూడా పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నందుకు కాలనీ ప్రజలు రామకృష్ణ గౌడ్ ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షులు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, వి.జగదీష్, బి.శంకర్ గౌడ్, కె.అశోక్, డి.సత్యనారాయణ, ఉమేష్, వెంకట్ యాదవ్, కె.రామకృష్ణ, సిఎచ్. మురళికృష్ణ, పి.వెంకటేష్ గౌడ్, స్కైలాబ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page