SAKSHITHA NEWS

వైద్య శిభిరంలో పాల్గొన్న వారికి పండ్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ తుడుం గణేష్

మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మేడ్చల్ మున్సిపాలిటటీ 4వ వార్డులో ఉచిత వైధ్య శిభిరం నిర్వహించారు. సీఎంఆర్ హాస్పటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిభిరాన్ని స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజు సందర్బంగా తన వార్డులో ఉచిత వైధ్య శిభిరం నిర్వహించి, వైధ్య శిభిరంలో పాల్గొన్న వారికి పండ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ వైద్య శిభిరంలో కంటి పరీక్షలు, బీసీ చెకప్, వంటి తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగ మందులను అందజేశారని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో తన వార్డులో సుమారు 10 సార్లు సీఎంఆర్ హాస్పటల్ వారు ఉచిత వైధ్య శిభిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. నిత్యం ప్రజా సేవకే అంకితమై ఉన్న మంత్రి మల్లారెడ్డి లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రానికి అవసరమన్నారు. ఉచిత వైధ్య శిభిరం నిర్వహించిన సీఎంఆర్ హాస్పటల్ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ హాస్పటల్ డాక్టర్లు, సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS