SAKSHITHA NEWS

ఉచిత కంటి పరిక్ష మరియు కళ్ళద్దాలు పంపిణి శిబిరం.
సాక్షిత, : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మునిసిపాలిటి,డాక్టర్స్ కాలనీలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరిశ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక నాయకులు అక్బర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు అవసరమైన వారికీ కంటి అద్దాలు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా *మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ * పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని,వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ,అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి సేవలను ప్రశంసించారు. ప్రజలందరూ ఇలాంటి సేవలను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి కంటి పరిక్షలు నిర్వహించి, 110 మందికి కంటి అద్దాలు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,అక్బర్ ఖాన్,ఉష, యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, సిపిఐ పర్వీన్,సైఫుద్దీన్,డా.ప్రభాకర్,డిసిసి సెక్రటరీ సాల్మన్ రాజు, మిద్దెల సీతారాంరెడ్డి,క్యాంపు నిర్వాహకులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS