SAKSHITHA NEWS

Former MLA Kuna Srisailam Goud participated in the BJP Shakti Kendra meeting in Nizampet RGK.

నిజాంపేట్ అర్జీకే లో బీజేపీ శక్తి కేంద్ర మీటింగ్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.

ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప లో శక్తి కేంద్ర ఇంఛార్జి దాసి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలయిన ఆయుష్మాన్ భారత్, ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన, తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీస్కెళ్ళాలని బీజేపి నాయకులకు పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు రామారావ్, లీలావతి, ప్రకాశం, కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, ప్రధాన కార్యదర్శి బిక్షపతి యాదవ్, నరేంద్ర చౌదరి, నాయకులు శివకుమార్ గుప్త, నగేష్ గుప్త, బూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS