SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులతో రాత్రి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమావేశమయ్యారు. శ్రీనివాస్ నగర్ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి పథకాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని, 9 ఏళ్లుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అభివృద్ధికి అడ్డంగా మారి, కుత్బుల్లాపూర్ ని కబ్జాల పూర్ గా మార్చాడని ఎద్దేవా చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, తన అనుచరులకు ఇండ్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు అలివేలు, విజయలక్ష్మి, సురేందర్, రవీందర్, శేఖర్, లక్ష్మి, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 13 At 5.04.53 Pm

SAKSHITHA NEWS