SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గండి మైసమ్మ చౌరస్తా వద్ద గల వేదిక ఫంక్షన్ హల్ లో బీజేపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో సంయుక్త మోర్చాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తో కలిసి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది ఏళ్ల సుపరిపాలను ప్రజలకు వివరించాలని శ్రేణులకు శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. మోర్చాల నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకమని, సమిష్టిగా పనిచేసి పార్టీ గెలుపుకి కృషి చేయాలన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి కేసీఆర్ సర్కారును గద్దె దించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా. ఎస్ మల్లారెడ్డి , రాష్ట్ర కార్యదర్శి కే. మాధవి , బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు దాసరి శ్యామ్ రావ్, జిల్లా నాయకులు, మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS