SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: సూరారం డివిజన్ పరిధిలోని కృష్ణ నగర్, వైష్ణవి నగర్ లలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు.
వైష్ణవి నగర్, కృష్ణా నగర్ లలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను, నత్త నడకన సాగుతున్న కల్వర్టు పనులను పరిశీలించారు.


డ్రైనేజ్ మరియు కల్వర్టు పనులకు 2020 లో ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన చేసి ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని అన్నారు.
కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేసానని చెప్పి, ప్రగతి యాత్ర చేస్తున్న ఎమ్మెల్యే వివేక్ కి కృష్ణా నగర్ లో సమస్యలు కనబడట్లేదా అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అని ప్రశ్నించారు.
దమ్ముంటే కృష్ణా నగర్, వైష్ణవి నగర్ లలో ఎమ్మెల్యే పర్యటించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, బీజేపీ నాయకులు వారాల మహేష్, నేమూరి రమేష్ గౌడ్, లింగం, భావిగడ్డ రవి, సుశాంత్ గౌడ్, రాజేష్ మిశ్రా, కేశవ్ యాదవ్, ఆకుల విజయ్ సాయి, పృద్వి, వేణు గౌడ్, నాగరాజు, కృష్ణ మూర్తి, శివ నాయక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS