కొంపల్లి హై విజన్ గేటెడ్ కమ్యూనిటీ లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ .

Spread the love

కొంపల్లి హై విజన్ గేటెడ్ కమ్యూనిటీ లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ .

సాక్షిత : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 డివిజన్ లోని హై విజన్ గేటెడ్ కమ్యూనిటీ లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు సినిప్లానెట్ నుండి హై విజన్ అపార్ట్మెంట్ వరకు గల రోడ్డు మరమ్మత్తులు లేక, గుంతలు గుంతలు గా ఉన్న రోడ్డును మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు ఈ రోడ్డుని వేయించానని, కనీసం మరమ్మతులు చేయించక పోవడం మున్సిపాలిటీ మొద్దు నిద్రకు నిదర్శనమని అన్నారు.

ప్రగతి యాత్ర పేరిట తిరుగుతున్న ఎమ్మెల్యే కు ఈ గుంతలు కనబడట్లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి, రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బీజేపీ అభిమాని రంగారావ్ నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాము గౌడ్, కౌన్సిలర్లు రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, ఉదయ్, బీజేపీ నిజాంపేట్ అధ్యక్షులు ఆకుల సతీష్, నాయకులు, శివాజీ, సతీష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page