SAKSHITHA NEWS

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ నెల్లూరు నగర నియోజకవర్గం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కలిసి సంఘీభావం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం,సిపిఐ, జనసేన పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS