SAKSHITHA NEWS

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన పెందుర్తి నియోజవర్గ వైసీపీ నాయకులు.

సాక్షిత:- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , వై.ఎస్.ఆర్.సి.పి అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పరవాడ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు., ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఈ క్రమంలో పెందుర్తి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైయస్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు.,రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయస్ జగన్ పలు సూచనలు చేశారు.,

ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ గెలుపే లక్ష్యంగా పని చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ , రాష్ట్ర CEC సభ్యులు పైల శ్రీనివాసరావు,పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,వైస్ ఎంపీపీ లు బంధం నాగేశ్వరరావు,బూస అప్పలరాజు, పల్లా అప్పారావు,నందవరపు శ్రీనివాసరావు, కలవలపల్లి సత్యనారాయణ,కన్నూరు శ్రీనువాస్ రావు,సునీల్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS