SAKSHITHA NEWS

అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థులకు

  • దోమ తెరలు వితరణ

సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచనలతో తమ అరవిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా అరవిందో సి ఎస్ ఆర్ కార్యక్రమాల్లో భాగంగా 2500 దోమతెరలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అప్పగించామని అరబిందో ప్లాంట్ హెడ్ వీ . పుల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ దయానిధికి ఫార్మా అరబిందో ఫౌండేషన్ తరపున సి ఎస్ ఆర్ నిధులలో 5.5 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2500 దోమతెరలను అప్పగించారు. ఈ సందర్భంగా అరబిందో ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తన ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అరవిందో అడ్మిన్ క్లస్టర్ హెడ్ హెచ్.వి రామకృష్ణ, హెచ్ఎర్ గౌరీ శంకర్ అడ్మిన్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS