SAKSHITHA NEWS

మొదటి స్థాయి పరిశీలనను క్షుణ్ణంగా చేయాలి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

సాక్షిత మెదక్ ప్రతినిధి:

మెదక్ జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఎఫ్.ఎల్.సి.పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఈ నెల 5 వ తేదీ నుంచి ఎఫ్.ఎల్. సి.మొదలవుతుందన్నారు.
ఎఫ్.ఎల్.సి.ని క్షుణ్నంగా పరిశీలనచేయాలని,ఎఫ్.ఎల్.సి.లొ బాగంగా మాక్ పోలింగ్ నిర్వహణ,వెబ్ కాస్టింగ్ లింక్,సీసీ కెమెరాల ఏర్పాటు,హాజరు పుస్తకాల నిర్వహణ,ఆన్లైన్ రిపోర్ట్ ల నిర్వహణ,సిబ్బంది గుర్తిoపు కార్డ్ లు,మౌలిక సదుపాయాల కల్పన,ఈవీఎం,వి,వి. ప్యాట్,బి.యు, సి.యు. లు ఏ మేరకు పని చేస్తున్నవి అని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు వేంకటేశ్వర్లు, రమేష్,మెదక్ ఆర్డీఓ రాజేశ్వర్,నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు,మెదక్ తహశీల్దార్ శ్రీనివాస్,జిల్లా ఎన్నికల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS