తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల ఆందోళన

Spread the love

మహారాష్ట్ర: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (Telangana Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది..

ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పుర్‌ (Nagpur) సమీపంలో నిలిపివేయడంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరిగెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు..

Related Posts

You cannot copy content of this page