SAKSHITHA NEWS

రైతన్నకు ధీమా రైతు బీమా
రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున రైతు బీమా చెక్కుల అందజేత

జిన్నారం

ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టె రైతన్నకు అండగా నిలవాలన్న సంబంధిత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టారని, ఈ పథకం రైతన్నకు అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

మండల కేంద్రమైన జిన్నారంకు చెందిన ఎర్రవల్లి నర్సింలు, పుట్టి నర్సింలు అనే ఇద్దరు రైతులు ఇటీవల మృతి చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రైతు బీమా ద్వారా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు అయింది.

ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS