బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్లో పోలీసులు వీటిని గుర్తించారు. అందులో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతోపాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొద్ది రోజుల క్రితం నగరంలో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటనలో 9 మంది గాయపడ్డారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మరోవైపు ఈ కేసులో నిందితుడికి సహకరించాడనే ఆరోపణలతో ఓ అనుమానితుణ్ని గత వారం దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి
Related Posts
మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా
SAKSHITHA NEWS మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీ మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి…
తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
SAKSHITHA NEWS తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను…