SAKSHITHA NEWS

సిద్దిపేట జిల్లా :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతికి కారు వాగులో గల్లంతయినట్లు స్థానికులు తెలిపిన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అక్కనపల్లి వాగులో రాత్రి కారు గల్లంతయినట్లు స్థానికుల సమాచారం తో ఉదయం నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సిద్దిపేట ఏసిపి సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కనపల్లి వాగు క్యాజ్ వే నుండి పోరెడ్డిపల్లి వంతెన వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలతో, గజ ఈతగాళ్లు వాగును జల్లెడ పడుతున్నారు. వాగులో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గాలిపు చర్యలకు ఆటంకం కలుగుతుంది.

అక్కనపల్లి వాగులో కారు గల్లంతయిన ఘటనలో ప్రయాణికులు క్షేమంగా బయటపడాలని స్థానికులు కోరుకుంటున్నారు.


SAKSHITHA NEWS