వేసవిలో నిరుపేదల దాహం తీరుస్తున్న ఐక్యత ఫౌండేషన్

Spread the love

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎల్లికల్ తండాలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన రాఘవేందర్ రెడ్డి గత వారం రోజుల క్రితం ఎల్లికల్ తండాలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటించి మంచినీటి ఆరో ప్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా శుద్ధమైన ఒక లక్ష యాభై వేలతో మంచినీటి ఆర్వో ప్లాంట్ ను ప్రజలందరి సమక్షంలో ప్రారంభించారు.ప్రజలందరూ శుద్ధమైన మంచినీటిని త్రాగడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని తెలుపుతూ ,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లికల్ తండా వాసులు భూపాల్ నాయక్,కిషన్ నాయక్,రాజు,శ్రీను నాయక్,పాండు, లాల్ సింగ్,పంతు నాయక్,పాలదిశివకృష్ణ,గుండయ్య, శంకర్,వల్య నాయక్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page