ఎల్లారెడ్డి నియోజకవర్గ బిఆర్ఏస్ పార్టీకి బిగ్ షాక్

Spread the love

ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం: MLA క్యాంప్ కార్యాలయం నందు గాంధారీ టౌన్ తాజా మాజీ సర్పంచ్ సంజీవ్, సొసైటీ డైరెక్టర్ సాయి కుమార్( డిసిబి, డిసిఏం డైరెక్టర్), నాగ్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ సతీష్, గాంధారీ టౌన్ మాజీ ఎంపీటీసీ రామ కృష్ణ రావు, PACS డైరెక్టర్ గణపతి, పోచయ్య, మాజి సొసైటీ వైస్ చైర్మన్ రమేశ్ మరియు ఇతర నాయకులు (60 మంది) బిఆర్ఏస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మదన్ మోహన్ వారి నిర్ణయం స్వాగతిస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ వచ్చేటట్టు కృషి చేస్తాము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంపత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్మేష్, సీతాయిపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర కాంగ్రస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page