కులం, మతం కన్నా గుణం మిన్న: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ముందుగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో నివాళులర్పించారు.
మహాత్మ పూలే జయంతి తో పాటు కస్తూర్బా గాంధీ జయంతి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.


పూలే, కస్తూర్బా గాంధీ చదువుకు ప్రాధాన్యత ఇస్తూ… అందరికి చదువు అందాలని ఎంతో… కృషి చేశారని, వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కులం, మతం కన్నా గుణం గొప్పదని, అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , రాష్ట్ర BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ , ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page