కొండకల్ గ్రామంలో బిజెపి అభ్యర్థి కెఎస్ రత్నం ఇంటింటి ప్రచారం

Spread the love

కొండకల్ గ్రామంలో బిజెపి అభ్యర్థి కెఎస్ రత్నం ఇంటింటి ప్రచారం

శంకర్‌పల్లి: నవంబర్ 18: (సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో బిజెపి అభ్యర్థి రత్నం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ కొండకల్ గ్రామంలో వంద ఫీట్ల రెడియల్ రోడ్డులో ఉన్నత పాఠశాలను తీసివెయడం జరుగుతుంది. పాఠశాలను తిసివెస్తె విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారు అని అన్నారు. తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని అధికార పార్టీ చెప్పింది ‌కాని ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చిందా అని రత్నం ప్రశ్నించారు? చేవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగడం ఖాయమన్నారు. అనంతరం కొండకల్ గ్రామ వివిద పార్టీ నాయకులు బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ నాయకులు, ప్రతాప్ రెడ్డి, రాములు గౌడ్, బద్దం రాంరెడ్డి, పర్వేద మైసైయ్య , శ్రీకాంత్, వినయ్, జిథు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page