SAKSHITHA NEWS

ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు

_ఈ సందర్భంగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గాంధీ చౌక్ లోని ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పథకాల గురించి మరియు చేయబోయే పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ మల్లు రవి కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం అంటూ ప్రజలను కోరారు

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు,నియోజకవర్గ అసెంబ్లీ మైనారిటీ ఇంచార్జ్ రహీం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS