ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

Spread the love

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

సాక్షిత కర్నూలు జిల్లా

ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ.ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వినూత్న కార్యక్రమం .ట్రాఫిక్ నియంత్రణ మనందరి భాద్యత.ఏక్కడైనా , ఏవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే నేరుగా ప్రజలేhttp://kurnoolpolice.in/trafficmitr కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు ఫోటో లేదా వీడియో తీసి చేరవేయాలి. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారణ చేసి చలనా, జరిమానా విధిస్తాం.ప్రతి పౌరుడు పోలీసే సహకరించాలి.వివరాలు అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. జిల్లా ఎస్పీ. శుక్రవారం కర్నూల్ ట్రాఫిక్ విభాగం పోలీసుల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ లో ట్రాఫిక్ మిత్ర “ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ హాజరై ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు

.
రాష్ట్రంలోనే మొదటిసారిగా కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసు విభాగం వారు ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం ను ఏర్పాటు చేశారన్నారు.
ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం .జిల్లా ప్రజలను, పౌరులను పోలీసు సేవలలో భాగస్వామ్యం చేసే ఉద్ద్యేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.


కర్నూలు ప్రజలు, యువత కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి మంచి సేవలందించే భావంతో పని చేయాలన్నారు. ఏక్కడైనా కళ్ళముందు వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే ఫోటో తీసి http://kurnoolpolice.in/trafficmitra/ ను క్లిక్ చేసి అందులో అప్ లోడ్ చేయాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన కు పాల్పడినట్లు పంపించిన ఫోటోలు, విడియోల ను కర్నూలు ట్రాఫిక్ పోలీసు విభాగం వారు విచారణ , నిర్ధారణ చేసి చలనా విధిస్తారన్నారు. ప్రతి ఒక్క పౌరుడు పోలీసు అవుతారన్నారు.

కర్నూలు ట్రాఫిక్ క్రమబద్దీకరణ పై ప్రజల సౌకార్యర్థం ఏవిధంగా సేవలందించాలనే ఆలోచనలు, సలహాలను కూడా పోలీసు వెబ్ సైట్ లో తెలియజేస్తే ఆ దిశ గా పని చేసే విధంగా చేస్తామన్నారు.ట్రాఫిక్ ఉల్లంఘన ల పై ఫోటోలు, విడియోలు బాగా అప్ లోడ్ చేసిన వివరాలను గుర్తించి ముగ్గురికి బహుమతులు అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు, కర్నూలు ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.


కర్నూలు ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో 70 మంది కి పై గా ఉంటారన్నారు.
కర్నూలు జనభా 7 లక్షల దాకా ఉండవచ్చన్నారు. కర్నూలు ట్రాఫిక్ పోలీసులు ప్రతి చోట ఉండి విధులు నిర్వహించడం కష్టమన్నారు. ప్రజలు, యువత కూడా సహాకారం అందించాలన్నారు. అందరూ కూడా కళాశాలల్లో, పాఠశాలలో విద్యార్థులకు కూడా ఈ ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం గురించి తెలియజేయాలన్నారు. అనంతరం ట్రాఫిక్ మిత్ర పోస్టర్ (గోడ పత్రిక) ను జిల్లా ఎస్పీ ఆవిష్కరణ

చేశారు.http://kurnoolpolice.in/trafficmitra/ లో మొబైల్ నంబర్ తో మీరు లాగిన్ అయి “ ట్రాఫిక్ మిత్ర కాలం నందు ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ , రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడుపుట, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హైల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుట, సీట్ బెల్ట్ లేకుండా కారు నడపడం వంటి వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘన ల పై పోలీసు వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రాంతం, వాహనం నెంబర్ లేదా వాహనం చిత్రాలు లేదా వీడియో తీసి పోలీసు వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కర్నూలులో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, ట్రాఫిక్ నిబంధనలు కట్టు దిట్టంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.


ప్రజలు సైతం కర్నూలు పోలీసు వెబ్ సైట్ లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేసే విధంగా , మంచి సేవలందించే విధంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. పోలీసు వెబ్ సైట్ ప్రారంభం జరిగిన తర్వాత ఇప్పటికే 532 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విచారణ చేసి 76 మంది పై రూ. 37 వేల 553 రూపాయల జరిమానా విధించామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, ట్రాఫిక్ డిఎస్పీ నాగభూషణం, కర్నూలు పట్టణ డిఎస్పీ కె వి మహేష్, సిఐలు శ్రీనివాసులు, అబ్దుల్ గౌస్, రమణ, ఆర్ ఎస్సైలు, ఎఎస్సైలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page