జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

Spread the love

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని సూర్యాపేట జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుశ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులో ఉన్నదని, కమ్యూనిటీ కార్యక్రమాలతో ప్రజలతో భాగస్వామ్యమైన పని చేస్తున్నాము అని, కేసుల నమోదు, నేర అభియోగ పత్రాలను సకాలంలో కోర్టుకు అందజేస్తామని, సాక్షులను, బాధితులను, నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరుస్తున్నామని యస్.పి జడ్జి కి వివరించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ సమన్వయం తో పని చేయాలని జడ్జి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమం నందు ఎస్పీ వెంట డిఎస్పీ లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, సీఐ లు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page